News June 4, 2024
40 ఏళ్ల టీడీపీకి ఆరో గెలుపు

తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 1983, 85, 89, 94లలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా NTR సారథ్యంలో టీడీపీ 3 సార్లు విజయం సాధించింది. 1994 తర్వాతి పరిణామాలతో చంద్రబాబు ఆ పార్టీ బాధ్యతలు చేపట్టి 1995లో సీఎం అయ్యారు. బాబు హయాంలో 1999, 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది.
Similar News
News November 28, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు 3,000 మంది ప్రముఖులు

ఉజ్వల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, యుఏఈ రాజ కుటుంబ సభ్యుడు షేక్ తారిక్ అల్ ఖాసిమీ, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్తో పాటు ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు హాజరుకానున్నారు.
News November 28, 2025
వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT
News November 28, 2025
భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?


