News June 4, 2024

40 ఏళ్ల టీడీపీకి ఆరో గెలుపు

image

తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 1983, 85, 89, 94లలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా NTR సారథ్యంలో టీడీపీ 3 సార్లు విజయం సాధించింది. 1994 తర్వాతి పరిణామాలతో చంద్రబాబు ఆ పార్టీ బాధ్యతలు చేపట్టి 1995లో సీఎం అయ్యారు. బాబు హయాంలో 1999, 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది.

Similar News

News September 15, 2025

సిరాజ్‌కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డు

image

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.

News September 15, 2025

రూ.5కే కిలో టమాటా

image

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?

News September 15, 2025

AI కంటెంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం?

image

ఏఐ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫొటోలు, ఆర్టికల్స్ అన్నింటికీ కచ్చితంగా లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా రిపోర్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఏఐ కంటెంట్ సాధారణ పౌరులతోపాటు వీఐపీలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పేర్కొంది.