News September 30, 2024

నేటి నుంచి నైపుణ్య గణన.. తొలుత మంగళగిరిలో

image

AP: నైపుణ్య గణన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మంగళగిరిలో ప్రారంభమవనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి యువతీయువకుల విద్యార్హతలు, ఉద్యోగ రంగం, నిరుద్యోగిత తదితర 25 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే మొదలవుతుంది. ఈ వివరాలతో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తుంది.

Similar News

News December 17, 2025

ఓటు వేసి వెళ్తూ గుండెపోటుతో మృతి

image

TG: తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా నాగులవంచ సత్యనారాయణ(65) గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది.

News December 17, 2025

లేటెస్ట్ మూవీ అప్డేట్స్

image

*రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న “ది రాజా సాబ్” సినిమా నుంచి ఈరోజు రెండో సాంగ్ విడుదల. సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని లులు మాల్‌లో ఈవెంట్ ప్లాన్ చేసిన నిర్మాతలు.
*విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవికిరణ్‌ తెరకెక్కిస్తోన్న ‘రౌడీ జనార్ధన’ టీజర్ విడుదల 22వ తేదీకి వాయిదా.
*మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక మూవీ “వృష‌భ‌” ఈ నెల 25న విడుదల కానుంది.

News December 17, 2025

ఫ్రిజ్ లేకపోయినా కూరగాయలు ఇలా ఫ్రెష్..

image

ఫ్రిజ్ లేకపోయినా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. * క్యారెట్లను అల్యూమినియం ఫాయిల్ తో చుట్టి, పైన, కింద తెరిచి ఉంచాలి. * కరివేపాకును ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టాలి. * గిన్నెలో నీళ్లు నింపి క్యాబేజీ అడుగు మునిగేలా ఉంచాలి. * టమాటాలు కాస్త గట్టివి తీసుకుంటే ఎప్పటికప్పుడు పండినవి వాడుకోవచ్చు. * కొనేటప్పుడే చూసుకొని ఎండినట్లు, వాడినవి తీసుకోకూడదు. ఇంట్లో ఎండ, వేడి తగలనిచోట కూరగాయలు ఉంచాలి.