News September 30, 2024

నేటి నుంచి నైపుణ్య గణన.. తొలుత మంగళగిరిలో

image

AP: నైపుణ్య గణన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మంగళగిరిలో ప్రారంభమవనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి యువతీయువకుల విద్యార్హతలు, ఉద్యోగ రంగం, నిరుద్యోగిత తదితర 25 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే మొదలవుతుంది. ఈ వివరాలతో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తుంది.

Similar News

News December 24, 2025

‘నీమాస్త్రం’ తయారీ, వినియోగం(2/2)

image

ముందు చెప్పిన పదార్థాలను ఒక సిమెంట్ తొట్టె/డ్రమ్ములో వేసి బాగా తిప్పాలి. 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పిఉంచాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోయాలి. ఇదే నీమాస్త్రం. దీన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. వారం లోపు వాడేసుకోవాలి.

News December 24, 2025

అనంతపురం జిల్లాలో 92 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: అనంతపురం జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ & సాధికారత అధికారి కార్యాలయం 92 <>అంగన్‌వాడీ<<>> కార్యకర్తలు, హెల్పర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసై, 21-35ఏళ్లు ఉన్న స్థానిక మహిళలు నేటి నుంచి డిసెంబర్ 31వరకు అప్లై చేసుకోవచ్చు. అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/

News December 24, 2025

ఏలినాటి శని దోషాన్ని పోగొట్టే ‘నలుపు’ రంగు

image

శని దేవునికి నలుపు ప్రీతికరమైనది. ఏలినాటి శని ప్రభావంతో బాధ పడేవారు నల్లని వస్త్రాలు ధరించాలి. నల్ల నువ్వులు దానం చేస్తే దోష తీవ్రత తగ్గుతుంది. శనీశ్వరుడిని నల్ల నువ్వుల నూనెతో అభిషేకించాలి. నల్లని ఆవులు, కాకులకు నల్ల నువ్వుల ఆహారం పెట్టాలి. నలుపు రంగు శని గ్రహ శక్తిని నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుందని నమ్మకం. ఈ పరిహారాలు పాటిస్తే వల్ల మానసిక ప్రశాంతత లభించి, ఆర్థిక పరమైన ఆటంకాలు తొలగిపోతాయి.