News September 30, 2024

నేటి నుంచి నైపుణ్య గణన.. తొలుత మంగళగిరిలో

image

AP: నైపుణ్య గణన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మంగళగిరిలో ప్రారంభమవనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి యువతీయువకుల విద్యార్హతలు, ఉద్యోగ రంగం, నిరుద్యోగిత తదితర 25 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే మొదలవుతుంది. ఈ వివరాలతో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తుంది.

Similar News

News December 19, 2025

PMUYతో ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై ₹300 రాయితీ: CBN

image

AP: రాష్ట్రంలోని 65.40 లక్షల LPG కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పరిధిలోకి తీసుకురావాలని CM CBN కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరారు. దానివల్ల సిలిండర్‌పై లబ్ధిదారుకు ₹300 రాయితీ లభిస్తుందని చెప్పారు. గ్యాస్ పైప్ లైన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కులను పెంచాలన్నారు. నెల్లూరు జిల్లాలో ₹96,862 CRతో ఏర్పాటయ్యే BPCL గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు.

News December 19, 2025

భారత్‌ను రెచ్చగొట్టే ప్లాన్‌తోనే దాడి: బంగ్లాదేశ్ మాజీ మంత్రి

image

బంగ్లాదేశ్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ ఇంటిపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారని హసీనా సర్కారులో విద్యా మంత్రిగా చేసిన మొహిబుల్ హసన్ చౌదరి ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయాలనే ఉద్దేశంతో మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ దేశంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. కింది స్థాయి పొలిటికల్ వర్కర్లను తొక్కేయాలని చూస్తున్నారన్నారు. భారత్‌ను రెచ్చగొట్టాలనే ఉద్దేశం కూడా దాడుల వెనుక ఉందని ఆరోపించారు.

News December 19, 2025

ఇవాళ, రేపు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఇవాళ, రేపు సింగిల్ డిజిట్‌కు టెంపరేచర్లు చేరుతాయని అంచనా వేశారు. HYDలోని పలు ప్రాంతాల్లో 5-8 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. చలితీవ్రత పెరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే వారం ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందన్నారు.