News October 27, 2025
శనగపిండితో చర్మానికి మెరుపు

చర్మసంరక్షణకు మన పూర్వీకుల కాలం నుంచీ శనగపిండిని వాడుతున్నారు. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొడిచర్మం ఉన్నవారు హైడ్రేషన్ కోసం శనగపిండిని వాడాలంటున్నారు. దీనికోసం 4 స్పూన్ల శనగపిండి, రోజ్వాటర్/ నిమ్మరసం, కాస్త తేనె కలపాలి. దీన్ని ఫేస్కి, మెడకు పట్టించుకొని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Similar News
News October 27, 2025
ఉపనిషత్తుల గురించి ఇవి మీకు తెలుసా..?

భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉపనిషత్తులు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి వేదాల అంత్య భాగాలైనందున వేదాంతాలని అంటారు. ‘ఉపనిషత్’ అంటే గురువు సన్నిధిలో పొందే ఆత్మజ్ఞానం. జగద్గురు ఆది శంకరాచార్యులు 11 ఉపనిషత్తులకు వివరణ రాశారు. నిజమైన సుఖం, ఆనందం కేవలం బయటి వస్తువుల ద్వారా కాక, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుందని ఉపనిషత్తుల సారం బోధిస్తుంది. ఇవి మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తాయి. <<-se>>#VedikVibes<<>>
News October 27, 2025
త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా!

AP: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా కల త్వరలోనే సాకారం కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇవ్వగా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా జిల్లాను ప్రతిపాదించింది. దీంతో మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అటు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం(D)లోకి తిరిగి చేర్చడంపై NOV 7న క్లారిటీ రానుంది.
News October 27, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ గడువు పొడిగింపు

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్షిప్ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. తాజాగా దరఖాస్తు గడువు తేదీని నవంబర్ 20 వరకు పొడిగించారు.
వెబ్సైట్: <


