News July 2, 2024

SKLM:రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ

image

రైతు భరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి తెలిపారు. సోమవారం కమాన్‌పూర్ మండలం గుండారం రాజేంద్రనగర్ రైతు వేదికలో పీఏసీఎస్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా రైతు భరోసాపై అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఆడిటర్ ముపాసిర్, పిఏసిఎస్ ఛైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.

Similar News

News November 8, 2025

కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

image

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.

News November 8, 2025

నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

image

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.

News November 8, 2025

SKLM: ‘క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

క్యాన్సర్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ అనిత అన్నారు. శ్రీకాకుళం డీ ఎం‌అండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వ్యాధి నివారణ కోసం శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో మొదటి స్థానంలో జబ్బు గుండె వ్యాధి ఉండగా, రెండవ స్థానంలో క్యాన్సర్ వ్యాధి ఉందని ఆమె పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఇంటి వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారన్నారు.