News February 1, 2025
SKLMలో హెలికాప్టర్ టూరిజం

తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం జిల్లాలో అందుబాటులోకి తెచ్చారు. రథసప్తమి వేడుకలు సందర్భంగా ఈ హెలికాప్టర్ టూరిజం జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో ఆదివారం, సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డచ్ బిల్డింగ్, కలెక్టరేట్ దగ్గర హెలికాప్టర్ రైడ్ను ఏర్పాటు చేశారు. రూ.1800తో 8 నిమిషాలపాటు రైడ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News February 13, 2025
పాతపట్నం: లారీ ఢీకొని బాలిక దుర్మరణం

లారీ ఢీకొని బాలిక మృతి చెందిన ఘటన HYDలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాతపట్నంకు చెందిన శ్రీనివాస్ HYDకు వలస వచ్చి చైతన్య బస్తీలో ఉంటున్నారు. వారి కుమార్తె మమత(17). ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేది. మంగళవారం రాత్రి స్నేహితుడితో కలిసి మూసాపేట్ Y జంక్షన్ వద్దకు రాగానే స్కూటీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 13, 2025
వాసుదేవు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలకు కలెక్టర్కు ఆహ్వానం

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీ వాసుదేవుని పెరుమాళ్ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మందస గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు.
News February 12, 2025
శ్రీకాకుళం: మరణంలోనూ వీడని బంధం..!

యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో కానీ ఒకే రోజు వీరి వివాహం జరిగింది. మరణం కూడా ఒకేరోజు గంటల వ్యవధిలో సంభవించింది. ఒకేరోజు అనారోగ్యంతో బావ, బామ్మర్ది మృతి చెందిన విషాదకర సంఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. సార సోమేశ్వరరావు (58) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, మరోవైపు కొర్రాయి నారాయణరావు (58) కూడా సోమేశ్వరరావు మృతి చెందిన కొన్ని గంటల్లోనే అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు.