News October 17, 2024
SKLM: ఈ నెల 18న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్
ఈ నెల అక్టోబర్ 18న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఫిర్యాదుదారుల నుంచి వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News October 18, 2024
SKLM: వాటికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి- కలెక్టర్
బాలల సంరక్షణ కేంద్రాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలల రక్షిత గృహాల నిర్వహణపై ఆయన సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాలు నిబంధనలు మేరకు నడపాలని సూచించారు.
News October 17, 2024
శ్రీకాకుళం: అలాంటి వారిపై చర్యలు తీసుకోండి
శ్రీకాకుళం జిల్లాలో 11 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ లేకుండా బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహించే కేంద్రాలపై కేసు నమోదు చేయాలన్నారు. అనుమతులు లేని బాలల సంరక్షణ కేంద్రాలను తక్షణమే మూయించాలని ఆదేశించారు.
News October 17, 2024
ఆదిత్యుని సేవలో తనికెళ్ల భరణి
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారిని సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వదించారు. ఆయనకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. ఆలయ డీసీ వై.భాద్రజీ పాల్గొన్నారు.