News July 17, 2024

SKLM: ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలిగా సంధ్య

image

ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా సంధ్య గజపతిరావు చౌదరి బుధవారం నియామకం అయ్యారు. ఈ మేరకు విజయనగరంలోని ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈమె ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో పలువురు ప్రశంసిస్తున్నారు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు చేపడతామని సంధ్య స్పష్టం చేశారు.

Similar News

News October 29, 2025

శ్రీకాకుళం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 37 మంది ప్రసవాలు

image

తుఫాన్ నేపథ్యంలో 27, 28 తేదీల్లో 37 మంది గర్భిణిలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు DCH కళ్యాణ్ బాబు మంగళవారం తెలిపారు. టెక్కలి 12, ఇచ్ఛాపురం 5, సోంపేట 2, నరసన్నపేట1, రణస్థలం 1లలో ప్రసవాలు జరిగాయన్నారు. నరసన్నపేట 8, పాతపట్నం 3, రణస్థలం 2, ఆమదాలవలస 1, హరిపురం-1, పొందూరు-1 ప్రసవాలు జరిగాయన్నారు. కోటబొమ్మాళి CHCలో గుండె పోటుతో వచ్చిన మహిళకు సుమారు రూ.40 వేల విలువచేసే ఇంజక్షన్ ఇచ్చినట్లు తెలిపారు.

News October 28, 2025

పలాస: జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

మొంథా తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లా మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్-హైదరాబాద్(విశాఖ ఎక్స్‌ప్రెస్), కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు విశాఖ-బరంపురం(ఇంటర్ సీటీ) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(మెమో) ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే ప్రయాణీకులు గమనించాలని కోరారు.

News October 28, 2025

ఒకడు ఇళ్ల తలుపులు.. మరొకడు బీరువా విరగ్గొట్టడంతో దిట్ట!

image

శ్రీకాకుళం జిల్లాలో రాత్రి పూట దొంగతనాలు చేస్తున్న ముఠాను <<18122311>>పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే<<>>. వీరు కాకినాడకు చెందిన వారు. వేంకటేశ్వర్లు, ప్రసాద్‌ పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారు. ఒకరు తాళాలు వేసిన ఇళ్ల తలుపులు విరగ్గొట్టడంలో ఎక్స్‌పర్ట్ అయితే మరొకడు బీరువా తలుపులు తెరవడంలో దిట్ట. వీరికి కాకినాడ సెంట్రల్ జైలులో క్రిమినల్ మోహనరావు పరిచమయ్యాడు. వీరంతా కలిసి జిల్లాపై కన్నేసి వరుస దొంగతనాలు చేశారు.