News February 18, 2025

SKLM: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. జడ్పీ మందిరంలో MLC ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Similar News

News November 26, 2025

ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

image

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.

News November 26, 2025

శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

image

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

News November 26, 2025

శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

image

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.