News February 26, 2025
SKLM: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

జిల్లాలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఓటర్లుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వారందరికీ ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేయడమైనదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News November 26, 2025
శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
News November 26, 2025
శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
News November 26, 2025
శ్రీకాకుళం రానున్న శాసనసభ అంచనాల కమిటీ: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 27న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. శ్రీకూర్మాం చేరుకొని శ్రీకూర్మనాధ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారన్నారు. రాత్రి శ్రీకాకుళం ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బస చేసి 28న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారని వివరించారు.


