News February 26, 2025

SKLM: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధం

image

జిల్లాలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ‌కాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయ‌న్నారు. ఓటర్లుకు త‌గిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వారంద‌రికీ ఓట‌ర్ స్లిప్పుల‌ను కూడా పంపిణీ చేయడమైనదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Similar News

News December 8, 2025

ఎచ్చెర్ల: పీజీలో సీట్లకు ప్రవేశాలు

image

డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఎచ్చెర్లలో వివిధ పీజీ కోర్సుల్లో (ఎం.ఎ, ఎం.కాం, ఎం.ఎస్సీ, ఎం.ఇడి) మిగిలిన సీట్లకు తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి. అడ్డయ్య సోమవారం తెలిపారు. ఈ ప్రవేశాలు ఈ నెల 9న మంగళవారం నుంచి క్యాంపస్‌లో జరుగుతాయన్నారు. ఏపీపీజీసెట్ రాసినా, రాయకపోయినా సీటు పొందని వారు ఈ స్పాట్ అడ్మిషన్స్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.

News December 8, 2025

బాల్యవివాహాలు నిర్మూలన మనందరి బాధ్యత: కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల రహిత భారత దేశంగా ముందుకు నడిపించేందుకు అందరి వంతు కృషి అవసరం అన్నారు. బాల్యవివాహాల వలన ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి అని ఆయన తెలియజేశారు. జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.

News December 8, 2025

శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

image

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.