News January 20, 2025
SKLM: ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 అర్జీలు

మీకోసం కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం మీకోసం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వినతులు అందించారు. తన దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 58 అర్జీలు వచ్చాయని ఎస్పీ వెల్లడించారు.
Similar News
News February 18, 2025
SKLM: అయోడిన్ లోపంపై అవగాహన అవసరం

శ్రీకాకుళం నగరంలోని DM&HO కార్యాలయంలో సోమవారం ఉదయం అయోడిన్ లోపంపై ఆశా వర్కర్లకు శిక్షణా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో DM&HO మురళి హాజరయ్యారు. జిల్లాలోని 4 మండలాల్లో 40 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ను ITC ఆర్థిక సహాయంతో చేస్తున్న కార్యక్రమాలను ఆశావర్కర్లకు వివరించారు. అయోడిన్ లోపంతో వచ్చే అనర్థాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News February 17, 2025
ఇచ్చాపురం: ఇటలీలో ఉద్యోగాలంటూ మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. పార్వతీపురానికి చెందిన ఓ ఏజెంట్తో కలిసి ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి వాసి ఈ మోసానికి పాల్పడ్డారు. జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దాదాపు 350 మంది నిరుద్యోగులను ఇటలీ పంపగా.. అక్కడ సరైన ఉద్యోగం లేక మోసపోయారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 17, 2025
SKLM: పది పరీక్షలకు 149 సెంటర్లు

శ్రీకాకుళం జిల్లాలో 28,984 మంది 10వ తరగతి ఫైనల్ పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వర్తిస్తాయని చెప్పారు. అలాగే 8 పరీక్షా కేంద్రాల్లో 807 మంది APOSS SSC పరీక్షలు రాస్తారన్నారు.