News July 7, 2024

SKLM: ఒడిశా బీచ్‌‌లో దారుణ హత్య.. ముగ్గురు అరెస్ట్

image

ఇచ్చాపురానికి చెందిన బాలురెడ్డిని ముగ్గురు వ్యక్తులు ఒడిశా బీచ్‌లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మండలంలోని బెల్లుపడకు చెందిన ఏదురు రాజు, బలరాంపురానికి చెందిన బాకి గణేశ్, లొద్దపుట్టికి చెందిన సాలిన దుర్యోధనను నిందితులుగా గుర్తించి ఒడిశా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తెర, కారు, సెల్‌ఫోన్ రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News November 13, 2025

ప్రభుత్వ చౌక ధరల డిపోలను తనిఖీ చేసిన రాష్ట్ర కమిషనర్

image

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ రోణంకి గోవిందరావు బుధవారం సోంపేటలో ఉన్న ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను తనిఖీ చేశారు. డీలర్లు సరుకులు ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా సరఫరా చేయాలని ఆదేశించారు. పంపిణీ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసిన, అక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం బారువాలో ఉన్న డిపోలను పరిశీలించారు. పంపిణీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

News November 12, 2025

శ్రీకాకుళం: 13 నుంచి పదవ తరగతి ఫీజు చెల్లింపునకు అవకాశం

image

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు చెప్పారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించాలని చెప్పారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News November 12, 2025

హిరమండలం: పెన్షన్ మంజూరు చేయాలని వేడుకోలు

image

హిరమండలంలోని భగీరధపురం గ్రామానికి చెందిన హరిపురం ఆదిలక్ష్మి (32) పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు బయోమెట్రిక్ పడకపోవడంతో తండ్రిని నామినీగా ఉంచి పింఛన్ అందిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రిందట తండ్రి మరణించడంతో పింఛనుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. సాంకేతిక కారణాలను తొలగించి పింఛను అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.