News March 18, 2025
SKLM: ఓటర్లు జాబితా తయారీకి చర్యలు తీసుకోవాలి

2కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ఓటర్లకు దగ్గరిలో ఉన్న పోలింగ్ కేంద్రానికి షిఫ్టింగ్ / మెర్జ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారిణి సాయి ప్రత్యూష స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం తహశీల్దారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఓటర్లు జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీల నుంచి సూచనలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 26, 2025
శ్రీకాకుళం: ఈ మండలాల ప్రజలకు అలెర్ట్

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఆమదాలవలస-38.1 ఉష్ణోగ్రత, బూర్జ-39, హిరమండలం-39.2, ఇచ్ఛాపురం-37.5, జలుమూరు-38-2, కంచిలి-37.4, కోటబొమ్మాళి-37.5, కొత్తూరు-39.7, ఎల్ఎన్ పేట-39 నరసన్నపేట-37.4, పాతపట్నం-38.9, పొందూరు-37.7, సారవకోట-38.4, సరుబుజ్జిలి-38.5, టెక్కలి-37.6 మండలాలకు అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంది.
News March 26, 2025
సీఎం రివ్యూ మీటింగ్లో శ్రీకాకుళం కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన అంశాలపై నివేదికలు సమర్పించారు. అలాగే జిల్లాకు అవసరమైన అభివృద్ధి పథకాల గురించి వివరించారు.
News March 25, 2025
SKLM: కరెంట్ షాక్తో అటెండర్ మృతి

శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.