News January 18, 2025
SKLM: కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు చేరినవారు వీరే.!

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు ఎచ్చెర్ల పోలీస్ ఆర్మ్డ్ రిజర్వు మైదానంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా పురుష అభ్యర్థులు 327 మంది దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
Similar News
News February 18, 2025
శ్రీరాంపురంలో టవర్ ప్రారంభానికి ముహూర్తం ఎప్పుడు..?

కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాలకు ఎంతో కాలంగా సెల్ సిగ్నల్స్ సమస్య వేధిస్తూనే ఉంది. ఈ మేరకు గ్రామ పరిధిలో BSNL అధికారులు సెల్ టవర్ నిర్మాణం పూర్తి చేసి ఏడాది గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సెల్ టవర్ సిగ్నల్స్ ప్రారంభం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News February 18, 2025
SKLM: గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై ఆర్డీవో సమీక్ష

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.