News November 22, 2024

SKLM: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ పద్మారావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 63 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 

Similar News

News December 23, 2025

శ్రీకాకళం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) మంగళవారం చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. సముద్రంలో వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు విశ్వనాథం సముద్రంలో పడిపోయే సమయంలో పడవకు ఉన్న ఫ్యాన్ ఆయనకు తగలడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఈశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 23, 2025

SKLM: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవిబాబు మంగళవారం తెలిపారు. BSE.AP వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు DEO కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్‌లో ఫీజు రూ.100, డ్రాయింగ్ HG ఫీజు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ LG రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ HG రూ.200లు ఈ నెల 27లోపు చెల్లించాలన్నారు.

News December 23, 2025

శ్రీకాకుళం: ఆ రోడ్డుపై బారులు తీరిన టాక్టర్లు ఎందుకంటే?

image

నందిగం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం లోడులతో రైతులు అవస్థలు పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ధాన్యం బస్తాలతో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నందిగం మండలంలో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలో ట్రక్ షీట్లు మంజూరు చేస్తుండగా 11 రైస్ మిల్లులో కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉండగా సోమవారం నాటికి కేవలం 2 మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.