News January 10, 2025

SKLM: దొంగలు వస్తారు..జాగ్రత్త

image

శ్రీకాకుళం పట్టణ ప్రజలకు రెండో పట్టణ సీఐ పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లే పట్టణ ప్రజలు మీ విలువైన బంగారు ఆభరణాలు నగదు తీసుకుని వెళ్లాలని అన్నారు. లేకుంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సీఐ చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ పరిధిలోని గురువారం ప్రచారం రథాల ద్వారా పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.

Similar News

News February 5, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

News February 5, 2025

పలాస: అబాకస్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

image

పలాస మండలం రామకృష్ణాపురంలో గల ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి మంగళవారం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న గీత చరిష్మా శ్రీకాకుళంలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపల్‌ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని టీచర్స్ కోరారు.

News February 4, 2025

అరసవల్లి: భక్తుల రాకపోకలను పరిశీలించిన కలెక్టర్

image

అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్  రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా భక్తుల సందర్శన, రాకపోకలను శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీంచారు. ఇంద్రపుష్కరిణిని పరిశీలించి అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.

error: Content is protected !!