News January 30, 2025
SKLM: నేటి నుంచి ఫస్ట్ సెమిస్టర్ పేపర్ల వాల్యుయేషన్

శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)కు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి మొదటి సెమిస్టర్ పేపర్స్ వచ్చాయని “మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) నేటి నుంచి ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్ మొదలైన పేపర్స్ వచ్చాయన్నారు.
Similar News
News November 4, 2025
శ్రీకాకుళం: ఆమె నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని అరసవల్లికి చెందిన మాడుగుల. ఇందిరా (36) ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News November 4, 2025
మెళియాపుట్టి: ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా..!

ప్రతిరోజూ ఏదోక చోట బస్సు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కొందరి వైఖరిలో మార్పులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మెళియాపుట్టి (M) గొప్పిలిలో ప్రయాణికులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ వెళ్తున్న దృశ్యం నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోక ముందే అధికారులు తనిఖీలు చేపట్టి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News November 4, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

➤పాపం పసి ప్రాణం.. పుట్టడమే శాపమా ?
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 52 అర్జీలు
➤శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల పూజలు
➤గ్రామాల అభివృద్ధికి కూటమి కృషి:  అచ్చెన్న, రామన్న
➤శ్రీకాకుళం: 80సార్లు అర్జీలిచ్చాం..అడుగు రోడ్డు వేయలేదు
➤దర్శనాలకు ఆటంకం లేకుండా చర్యలు: హిరమండలం ఎస్సై
➤ హామీ అమలుతో శ్రీకాకుళం జిల్లాలో 1,350 మందికి మేలు


