News October 21, 2024
SKLM: నేడు టీచింగ్, నాన్-టీచింగ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్-టీచింగ్ మెరిట్ లిస్ట్ సబ్జెక్టుల వారిగా విడుదలైంది. ఈ మేరకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను సోమవారం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మెరిట్ టీచింగ్, నాన్-టీచింగ్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో దగ్గరలో ఉన్న డీఈవో కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుందని డీఈవో తిరుమల చైతన్య పేర్కొన్నారు.
Similar News
News December 15, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤కాశీబుగ్గ: ఈనెల 20న జాబ్ మేళా
➤ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది: అచ్చెన్న
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 46 అర్జీలు
➤అభ్యుదయ సైకిల్ యాత్రలో పాల్గొన్న అధికారులు
➤ఇచ్ఛాపురం: 6నెలలు గడిచినా బాధితులకు అందని న్యాయం
➤బొరిగివలసలో లైన్ మ్యాన్కు కరెంట్ షాక్
➤ధర్మాన వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఎమ్మెల్యే శంకర్
News December 15, 2025
కాశీబుగ్గ: 600 ఖాళీలకు..జాబ్ మేళా

కాశీబుగ్గలోని శ్రీ సాయి శీరిషా డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఈనెల 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. ఆయా కంపెనీల్లోని ఖాళీగా ఉన్న 600 ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిటెక్, ITI చదివిన అభ్యర్థులకు అవకాశం ఉంటుందన్నారు.
News December 15, 2025
ప్రజలను వైసీపీ తప్పుదోవపట్టిస్తుంది: మంత్రి అచ్చెన్న

వైసీపీ అబద్ధాలతోనే ఐదేళ్లు కాలక్షేపం చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. వారి పాలనలో రూ.లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి సంక్షేమం వైపు అడుగులేస్తుంటే ఓర్వలేక బూటకపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.


