News October 21, 2024

SKLM: నేడు టీచింగ్, నాన్-టీచింగ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్-టీచింగ్ మెరిట్ లిస్ట్ సబ్జెక్టుల వారిగా విడుదలైంది. ఈ మేరకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను సోమవారం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మెరిట్ టీచింగ్, నాన్-టీచింగ్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో దగ్గరలో ఉన్న డీఈవో కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుందని డీఈవో తిరుమల చైతన్య పేర్కొన్నారు.

Similar News

News October 24, 2025

రణస్థలం: బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటోడ్రైవర్‌పై కేసు

image

బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న ఆటో డ్రైవర్‌ రామారావుపై కేసు నమోదైంది. రణస్థలం SI వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యం కారణంగా నిద్రపోవాలంటే మాత్ర వేసుకోవాల్సిందే. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఆటోడ్రైవర్ ఆయన కుమార్తెపై కన్నేశాడు. బాలిక తల్లికి మద్యం అలవాటు చేశాడు. వాళ్లు మత్తులో ఉండగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల తండ్రికి విషయం తెలిసి ఫిర్యాదు చేశారు.

News October 23, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

◈తాడేపల్లి ప్యాలెస్ నుంచి కల్తీ మద్యం సరఫరా: ఎమ్మెల్యే మామిడి
◈ టెక్కలి: నందెన్న ఊరేగింపులో ఘర్షణ..ఇద్దరిపై కేసు నమోదు
◈ మందస: చాపరాయి భూ సమస్యపై న్యాయం చేయాలి
◈అధ్వానంగా సరుబుజ్జిలి, కొత్తూరు ప్రధాన రహదారులు
◈ శ్రీకాకుళం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
◈ సింధూర జలసిరిపై పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
◈ఎల్.ఎన్ పేట: శవ దహనానికి సవాలక్ష పాట్లు
◈ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న

News October 23, 2025

నరసన్నపేట: నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

image

నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన నరసన్నపేటలోని దేశవానిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన జనార్ధన్ (45) గత కొన్నేళ్లుగా మానసిక పరిస్థితి బాగులేదు. బుధవారం ఉదయం కనిపించకపోగా కుటుంబీకులు వెతికారు. సాయంత్రం నెలబావిలో శవమై తేలడంతో స్థానికులు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. బంధువుల ఫిర్యాదుతో ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.