News September 3, 2024

SKLM: పంట నీటి మునిగితే ఇలా చేయండి..!

image

దుబ్బు దశలో ఉన్న వరి పైరు ఇటీవలే కురిసిన వర్షాలకు నీట మునిగింది. ఈక్రమంలో పంటకు రైతులు బూస్టర్ ఎరువులు వేయాలని శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ బాబు ఒక ప్రకటనలో సూచించారు. ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలని శాస్త్రవేత్త భాగ్యలక్ష్మి చెప్పారు. ఎటువంటి సందేహాలు ఉన్నా రైతులు తమను సంప్రదించాలని కోరారు.

Similar News

News December 22, 2025

శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను ఫిర్యాదుల రూపంలో నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News December 21, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

✩శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా పల్స్ పోలియో
✩జలమూరు: మా రెండు గ్రామాలను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
✩ఆమదాలవలస: పుష్కరిణిలో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి
✩నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా: ఎమ్మెల్యే అశోక్
✩పలాసలో రక్తదానం చేసిన మాజీ మంత్రి సీదిరి
✩ గొప్పిలిలో వరి కుప్ప దగ్ధం
✩లావేరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
✩ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

News December 21, 2025

ఇటుకల బట్టీలు వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసిన Dy DMHO

image

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎం‌హెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.