News February 17, 2025
SKLM: పది పరీక్షలకు 149 సెంటర్లు

శ్రీకాకుళం జిల్లాలో 28,984 మంది 10వ తరగతి ఫైనల్ పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వర్తిస్తాయని చెప్పారు. అలాగే 8 పరీక్షా కేంద్రాల్లో 807 మంది APOSS SSC పరీక్షలు రాస్తారన్నారు.
Similar News
News March 16, 2025
సారవకోట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

సారవకోట మండలం కురిడింగి గ్రామం వద్ద పాతపట్నం నర్సంపేట హైవే రోడ్డుపై లారీ కారు పరస్పరం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరి మృతి చెందారు. ఆదివారం పాతపట్నం నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న లారీ, నరసన్నపేట నుంచి పాతపట్నం వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలో చనిపోయారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News March 16, 2025
శ్రీకాకుళంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దారి జడ్జి బంగ్లా ఎదురుగా గల మురికి కాలువలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (45) పడిపోయి ఉండగా స్థానికులు ఈ నెల 13న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడని శ్రీకాకుళం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే 63099 90824 నంబర్ను సంప్రదించాలని సీఐ సూచించారు.
News March 16, 2025
ఇచ్ఛాపురం: కరెంటు స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం మండలం కొలిగాం గ్రామ సమీప మలుపు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్కు చెందిన రాజేశ్ ఓ ఇటుకుల కంపెనీలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని మరో వ్యక్తితో బైక్పై అతివేగంగా వస్తూ.. కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.