News February 14, 2026
SKLM: ‘పరీక్షలు నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది’

త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, 10th పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ వంటి మౌళిక సౌకర్యం కల్పిస్తామన్నారు.
Similar News
News March 13, 2026
శ్రీకాకుళం: జనాభా ఆధారంగా పంచాయితీల విభజన!

ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ సర్పంచులు పదవీకాలం ముగుస్తుంది. సకాలంలో ఎన్నికలు జరగకపోయినా, కొన్ని నెలల్లో నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 912 పంచాయతీలు ఉండగా, కొత్త పంచాయతీలు పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా 10 వేలు జనాభా దాటిన గ్రామాలను రూర్బన్, 10,000 లోపు గ్రామాలను గ్రేడు -1, జనాభా 2000 లోపు ఉంటే గ్రేడ్ -2 విభజన జాబితా కసరత్తు చేస్తున్నారు.
News March 13, 2026
శ్రీకాకుళం జిల్లాలో మెదటి సారి కిడ్నీ మార్పిడి చికిత్స

పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నేడు మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విశాఖకు చెందిన వైద్య బృందం చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సుమారు రూ. 12 కోట్ల నిధులతో అత్యాధునిక పరికరాలు, అర్హత కలిగిన వైద్యులను నియమించి ప్రతి రోజు ఉచితంగా డయాలసిస్ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో సోంపేటకు చెందిన యువతి హేమశ్రీకి మొదటి కిడ్నీ మార్పిడి చికిత్స నేడు జరగనుందని MLA శిరీష ఓ ప్రకటనలో తెలిపారు.
News March 13, 2026
ఫైల్స్ క్లియెరెన్స్లో అచ్చెన్న బెస్ట్

పరిపాలన విభాగంలో ఫైల్స్ క్లియరెన్స్ అన్నది కీలకం. రాష్ట్ర మంత్రుల్లో మన జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఫైల్స్ క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లో 3,362 ఫైల్స్ను క్లియర్ చేశారు. 551 గంటలు ఫైల్స్ క్లియరెన్స్కు సమయం తీసుకున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు.


