News September 13, 2024
SKLM: పారదర్శకంగా గ్రామ, వార్డు మహిళా పోలీసులు బదిలీలు

సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి బదిలీలు నిర్వహించారు. మొత్తం 238 మంది మహిళా పోలీసులు ఆన్లైన్లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా 71 మందికి బదిలీలు చేయగా 149 మంది యథావిధిగా వారి స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలపగా,18 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News December 23, 2025
శ్రీకాకళం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) మంగళవారం చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. సముద్రంలో వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు విశ్వనాథం సముద్రంలో పడిపోయే సమయంలో పడవకు ఉన్న ఫ్యాన్ ఆయనకు తగలడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఈశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 23, 2025
SKLM: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవిబాబు మంగళవారం తెలిపారు. BSE.AP వెబ్సైట్లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు DEO కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్లో ఫీజు రూ.100, డ్రాయింగ్ HG ఫీజు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ LG రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ HG రూ.200లు ఈ నెల 27లోపు చెల్లించాలన్నారు.
News December 23, 2025
శ్రీకాకుళం: ఆ రోడ్డుపై బారులు తీరిన టాక్టర్లు ఎందుకంటే?

నందిగం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం లోడులతో రైతులు అవస్థలు పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ధాన్యం బస్తాలతో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నందిగం మండలంలో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలో ట్రక్ షీట్లు మంజూరు చేస్తుండగా 11 రైస్ మిల్లులో కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉండగా సోమవారం నాటికి కేవలం 2 మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


