News January 22, 2025

SKLM: ‘పెండింగ్ కేసులు వేగవంతం చేయాలి’

image

అపరిష్కృతంగా ఉన్న (క్రైమ్ అగైనెస్ట్) మహిళలు, చిన్నారులపై జరిగే కేసులు, హిట్ అండ్ రన్ కేసులపై దృష్టి కేంద్రీకరించి, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఎస్పీ శ్రీ కేవీ.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ వెల్లడించారు.

Similar News

News February 19, 2025

SKLM: ‘ఆవుపాలు ధర పెంచాలి’

image

తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

News February 19, 2025

కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

image

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

News February 19, 2025

SKLM: పోలీసులకు దొరికిన విద్యార్థులు

image

శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. పాత్రునివలస టిడ్కో కాలనీలో మంగళవారం సాయంత్రం ఆరుగురు సీక్రెట్‌గా గంజాయి తాగుతుండగా రూరల్ పోలీసులు దాడులు చేశారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ఇందులో వైజాగ్‌కు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు ఉన్నారు. సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ.. ఇంకా కేసు నమోదు చేయలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. 

error: Content is protected !!