News March 6, 2025
SKLM: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం (పి-4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
Similar News
News December 4, 2025
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: DM&HO

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని DM &HO అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం లింగ ఆధారిత హింస నివారణ, మెడికో లీగల్ కేర్పై శిక్షణ కార్యక్రమం జరిగింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న హింసలను అరికట్టి, లింగ వివక్ష చూపరాదని డీఎంహెచ్వో తెలియజేశారు.
News December 3, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤కోటబొమ్మాళిలో జేసీ ఆకస్మిక తనిఖీ
➤పాతపట్నం: లగేజీ ఆటో బోల్తా.. బాలుడికి గాయాలు
➤మనుషుల నుండి Scrub Typhus వ్యాపించదు: DMHO
➤శ్రీకాకుళం: ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం వద్దు
➤రైతుసేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు
➤మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష
➤మందస: నరకాన్ని తలపిస్తున్న రహదారులు
News December 3, 2025
శ్రీకాకుళం: ‘స్ర్కబ్ టైఫస్ వ్యాధి..పరిశుభ్రతతో దూరం

‘స్ర్కబ్ టైఫస్’ వ్యాధి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం(D) కొత్తూరు, గార, హిరమండలంలో 10 రోజుల క్రితం కొంతమంది దీని బారిన పడ్డారు. ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికార ప్రకటన రావాల్సి ఉంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో నల్లిని పోలిన చిన్న పురుగు పెరుగుతోంది. ఇది కుట్టడంతో ఈ వ్యాధి వ్యాపిస్తోందని, తీవ్ర జ్వరం, అలసట, జలుబు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు.


