News November 30, 2024
SKLM: ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాలు చేదనా, తదితర అంశాలపై చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన వారికి ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి చేతులు మీదుగా ప్రశంస పత్రాలను ప్రదానం చేసి ప్రశంసించారు. అదనపు ఎస్పీ కెవి రమణ ఉన్నారు.
Similar News
News April 13, 2026
నేడే SKLM-TPT హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు

శ్రీకాకుళం జిల్లా నుంచి నేరుగా తిరుపతికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇటీవల రైల్వే శాఖ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు)రైల్వే స్టేషన్-తిరుపతికి నడిచే హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను కేంద్రమంత్రి రామ్మోహన్ ఇవాళ మధ్యాహ్నం 2-15ని.లకు ప్రారంభించనున్నట్లు ఆ కార్యాలయం నుంచి నిన్న ఓ ప్రకటన వచ్చింది. ఈ డైరెక్ట్ ట్రైన్ సర్వీస్కు ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల సాకారమవ్వనుంది.
News April 12, 2026
హిరమండలంలో జరిగిన దొంగతనంలో ట్విస్ట్

హిరమండలంలోని దేవరశెట్టి వీధిలో శనివారం భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారంలో <<19625168>>బిగ్ ట్విస్ట్<<>> నెలకొంది. చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపిన ఆభరణాలన్నీ ఇంటిలోనే ఉండటంతో అసలు చోరీయే జరగలేదని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం భారీ చోరీ జరిగిందంటూ పోలీసులకు సమాచారం రావడంతో కొత్తూరు CI ప్రసాదరావు, SI మధుసూదనరావు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News April 12, 2026
రణస్థలం: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు సాధించిన యువకులు

రణస్థలం మండల పరిధిలోని రావాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో SSC పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో లంక వెంకటేశ్ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సూపరింటెండెంట్గా, గొర్లె అప్పలనాయుడు జూనియర్ స్టాటిస్టికల్ అధికారిగా ఎంపికయ్యారు. ఇరువురి తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు. దీంతో వీరికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.


