News January 3, 2025
SKLM: ఫసల్ బీమా యోజన సాయం పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
రైతులకు ప్రతేడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఫసల్ బీమా యోజన పరిహారాన్ని రూ.6000 నుంచి రూ.10000లకు పెంచుతూ ఇటీవల ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న రెండు లక్షల 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. గతంలో నాలుగు విడతలుగా రూ.1500 జమచేయగా ప్రస్తుతం రూ.2500 జమ చేస్తామన్నారు.
Similar News
News January 14, 2025
SKLM: ఈ నెల 20లోగా డోనర్ పాసులకు పేర్లు నమోదు ఆఖరి
వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
News January 14, 2025
శ్రీకాకుళం: పండగ పూట కుటుంబంలో విషాదం
టెక్కలి హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దసాన గ్రామానికి చెందిన జి. అప్పారావు <<15148221 >>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈయన విశాఖలో కూలి పనులు చేస్తూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. పండగకు సోదరిని పిలిచేందుకు ఆదివారం గ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా HYD వెళ్తున్న బస్సు ఢీకొంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 14, 2025
శ్రీకాకుళం: కొట్లాట ఘటనలో నలుగురిపై కేసు నమోదు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో సోమవారం జరిగిన కొట్లాట ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జీ.చిట్టిబాబు, ఎస్.విశ్వనాథం మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో వారు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు.