News February 7, 2025

SKLM: బందోబస్తు చర్యలు హర్షనీయం: ఎస్పీ

image

శ్రీకాకుళం పట్టణం అరసవల్లిలో శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు మూడు రోజుల పాటు కనుల పండువగా జరిగాయి. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని గురువారం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ఠ బందోబస్తు చర్యలు హర్షణీయమని కొనియాడారు.

Similar News

News February 7, 2025

రెండు కుటుంబాలను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

image

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్(21), తరుణ్(19) <<15378854>>మృతి చెందిన<<>> సంగతి విదితమే. సరదాగా బైక్‌పై బయటకు వెళ్లిన ఇద్దరినీ మృత్యువు కబళించింది. కాగా చిన్న వయస్సులోనే ఇంటి బాధ్యతలు మోస్తున్న యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కార్తీక్ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం రవాణా కూలీగా చేస్తున్నారు. తరుణ్ ఓ బట్టల షాపులో పని చేస్తున్నారు.

News February 7, 2025

శ్రీకాకుళం: రహదారి విస్తరణకు రూ.107 కోట్లు మంజూరు

image

సుదీర్ఘ ప్రాంత గ్రామాలకు అనుసంధానంగా ఉన్న డీపీఎన్ రహదారి విస్తరణ, తారు రోడ్డు నిర్మాణం పనులకు ఎన్డీఏ ప్రభుత్వం రూ.107 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కిజరాపు అచ్చెన్నాయుడు గురువారం తెలిపారు. పోలాకి మండలం, డోల గ్రామాల నుంచి సంతబొమ్మాళి మండలం నౌపడ వరకు రెండు లైన్ల రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. టీడీపీ నాయకులు మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.

News February 7, 2025

మంత్రి అచ్చెన్నాయుడికి 17వ ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికి 17వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.

error: Content is protected !!