News June 12, 2024
SKLM: బాబాయ్ రాష్ట్ర మంత్రి.. అబ్బాయి కేంద్ర మంత్రి

టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి కాగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ కేబినెట్లో అచ్చెన్నాయుడుకు స్థానం లభించడంతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకే కుటుంబంలో బాబాయ్ రాష్ట్ర మంత్రిగా, అబ్బాయి కేంద్రమంత్రిగా వ్యవహరించనుండటం విశేషం. కీలక పదవుల్లో ఉన్న వీరిద్దరూ జిల్లాను అభివృద్ధి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News November 27, 2025
SKLM: రేషన్ షాపుల్లో బియ్యానికి బదులు రాగులు పంపిణీ.!

జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈనెల 27 నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులకు డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా మూడు కిలోల వరకు ఉచితంగా రాగులు అందించాలన్నారు.
News November 27, 2025
SKLM: రేషన్ షాపుల్లో బియ్యానికి బదులు రాగులు పంపిణీ.!

జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈనెల 27 నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులకు డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా మూడు కిలోల వరకు ఉచితంగా రాగులు అందించాలన్నారు.
News November 27, 2025
శ్రీకాకుళం: యాక్సిడెంట్..మృతుల వివరాలు ఇవే.!

పలాస మండలం గరుడఖండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు <<18406276>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలకాపు వేణుగా పోలీసు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు సుశాంత్ (23) ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్ ద్రమగిరి బ్లాక్ డేరా గ్రామానికి చెందిన యువకుడు అని తెలిపారు.


