News June 12, 2024
SKLM: బాబాయ్ రాష్ట్ర మంత్రి.. అబ్బాయి కేంద్ర మంత్రి

టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి కాగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ కేబినెట్లో అచ్చెన్నాయుడుకు స్థానం లభించడంతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకే కుటుంబంలో బాబాయ్ రాష్ట్ర మంత్రిగా, అబ్బాయి కేంద్రమంత్రిగా వ్యవహరించనుండటం విశేషం. కీలక పదవుల్లో ఉన్న వీరిద్దరూ జిల్లాను అభివృద్ధి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News March 23, 2025
అరసవల్లి ఆదిత్యుని నేటి ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.3,76,300/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,41,803/-లు, ప్రసాదాలకు రూ.1,73,720/-లు,శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
News March 23, 2025
ఎచ్చెర్ల రోడ్డు ప్రమాదంలో టెక్నీషియన్ మృతి

ఎచ్చెర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన దేశరాజ వెంకట కిరణ్ కుమార్(40) ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ వద్ద జంక్షన్ దాటుతుండగా రాజాం నుంచి వస్తున్న క్యాబ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎచ్చెర్లలో రూమ్ తీసుకొని రణస్థలం ప్రభుత్వాసుపత్రి CHCలో టెక్నీషియన్గా చేస్తున్నాడు. ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News March 23, 2025
ఎచ్చెర్ల: ఆరుగురిపై క్రిమినల్ కేసులు

కుప్పిలి ఆదర్శ పాఠశాల విద్యార్థుల మాస్ కాపీయింగ్కు ఉపాధ్యాయులు సహకరించారని శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య ఎచ్చెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులతోపాటు మరికొందరి పాత్ర ఉందని డీఈఓ ఫిర్యాదు చేయగా ఎఫ్ఎఆర్లో వారి పేర్లు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. సందీప్ కుమార్ చెప్పారు.