News January 2, 2025

SKLM: రథసప్తమి వేడుకల కోసం నేడు భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ

image

అరసవల్లి రథసప్తమి మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భక్తుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటలకు భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షత వహించనున్నారు.

Similar News

News December 4, 2025

SKLM: ‘ప్రజలు సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత’

image

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంపైనే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయం నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం కుసుమ పథకం కింద ఉన్న భూమి వివాదాలు, ఎరువులు సరఫరా లోపాలు, పెన్షన్ల పంపిణీలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు.

News December 4, 2025

ఈనెల 7న NMMS ప్రతిభా పరీక్ష: DEO

image

ఈనెల 7న NMMS ప్రతిభ పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలోని 25 కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 5,627 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని కోరారు.

News December 4, 2025

SKLM: ‘ఆలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురి అరెస్ట్’

image

జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,71,000 స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఈ ముగ్గురూ గతంలో ఆముదాలవలసలో మోటార్ బైకుల దొంగతనం కేసులో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు కూడా డీఎస్పీ వెల్లడించారు.