News December 19, 2024

SKLM: రథ సప్తమిని రాష్ట్ర పండుగ‌గా గుర్తింపు

image

ఆరోగ్య ప్ర‌దాత‌, ప్ర‌త్య‌క్ష దైవం అర‌స‌వ‌ల్లి శ్రీ సూర్య‌నారాయ‌ణస్వామి వారి ర‌థ‌స‌ప్తమి వేడుక‌ల‌ను రాష్ట్ర పండుగ‌గా ప్ర‌భుత్వం గుర్తిస్తూ గురువారం జీవో విడుద‌ల చేసింది. ఈ మేర‌కు MLA గొండు శంక‌ర్ విశాఖ-ఎ కాల‌నీలోని త‌న కార్యాల‌యం నుంచి గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌తీ ఏటా ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో సూర్య‌దేవుని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ర‌థ‌స‌ప్తమి వేడుక‌లు నిర్వహిస్తుంటామని తెలిపారు.

Similar News

News November 21, 2025

సంతబొమ్మాళిలో మహిళ దారుణ హత్య!

image

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమయిందని, మర్డర్‌కు గురైనట్లు ఎస్సై నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. నందిగామ మండలం కొండబీంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలత (34) గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి వరకు పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలను పోస్ట్ చేశారు. ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉందన్నారు.

News November 20, 2025

నౌపడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

image

సంతబొమ్మాళి మండలం నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 20, 2025

SKLM: ‘సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’

image

సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ పొందేందుకు నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 80 ఫీట్ రోడ్డులో గల బీసీ స్టడీ కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం డిసెంబర్ 5న వెరిఫికేషన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. కుల ప్రాతిపదిక పైన ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి విజయవాడలోని గొల్లపూడి సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇస్తారన్నారు.