News December 19, 2024
SKLM: రథ సప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తింపు

ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తిస్తూ గురువారం జీవో విడుదల చేసింది. ఈ మేరకు MLA గొండు శంకర్ విశాఖ-ఎ కాలనీలోని తన కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యదేవుని పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తుంటామని తెలిపారు.
Similar News
News November 26, 2025
శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
News November 26, 2025
శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
News November 26, 2025
శ్రీకాకుళం రానున్న శాసనసభ అంచనాల కమిటీ: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 27న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. శ్రీకూర్మాం చేరుకొని శ్రీకూర్మనాధ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారన్నారు. రాత్రి శ్రీకాకుళం ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బస చేసి 28న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారని వివరించారు.


