News September 11, 2024

SKLM: రాష్ట్ర పండుగగా కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర

image

కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొత్తమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ జాతర నిర్వహణ కోసం రూ.కోటి మంజూరు చేసింది. ఈ నిధులను అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొంది.

Similar News

News December 11, 2025

శ్రీకాకుళం: జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనాలు

image

బూర్జలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ, కోనసీమ, బిహార్‌కు చెందిన నాగరాజు, ఆనంద్, శ్రీను, చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలుకెళ్లారు. బయటొచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బూర్జ. ఆ గ్రామానికి చెందిన రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని శ్రీను గమనించాడు. ఈ నెల 1న అందరూ కలిసి దొంగతనం చేసినట్లు DSP వివేకానంద తెలిపారు.

News December 11, 2025

శ్రీకాకుళం కలెక్టర్‌కు 15వ ర్యాంక్

image

సిక్కోలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 15వ ర్యాంకు సంపాదించారు. ఆయన వద్దకు ప్రజల సమస్యలపై 931 ఫైల్స్ రాగా 703 పరిష్కరించారు. ఒక్కో ఫైల్‌ను పరిష్కరించేందుకు ఆయన 2 రోజుల 3 గంటల సమయం తీసుకున్నారు. దీంతో ఆయన పనితీరుకు CM చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాంక్ ఇచ్చారు

News December 11, 2025

శ్రీకాకుళం: ‘అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతం చేయాలి’

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15-29 వరకు శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు జరిగే “అభ్యుదయం సైకిల్ యాత్ర”ను విజయవంతం చేయాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి కోరారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ నెల 15న ప్రారంబమయ్యే అభ్యుదయం సైకిల్ యాత్ర పలు శాఖల వారీగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. DM&HO, RDOలు ఉన్నారు.