News December 18, 2024

SKLM: రూ.15 లక్షలు వేరే అకౌంట్లోకి.. తిరిగి అందించిన పోస్టల్ సిబ్బంది

image

అరసవిల్లికి చెందిన ప్రసాదరావు అనే వ్యక్తి తన బ్యాంకు అకౌంట్లో దాచుకున్న సుమారు రూ.15 లక్షలను పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించారు. అయితే ఆ నగదు సాంకేతిక లోపంవల్ల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలోకి జమ అయ్యాయి. కాగా పోస్టల్ సిబ్బంది అంబుడ్సమన్ ద్వారా ఆ నగదును తిరిగి కస్టమర్‌ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేలా చేశారు. దీంతో పోస్ట్ మాస్టర్‌ రంగారావుకి కస్టమర్ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 30, 2025

శ్రీకాకుళం: ’65 హాట్‌స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి’

image

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన 65 హాట్‌స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌‌లో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమవేశం నిర్వహించారు. కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని చెప్పారు.

News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.

News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.