News September 3, 2024
SKLM: రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

శ్రీకాకుళం జి ఆర్ పి పరిధి రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు శ్రీకాకుళం జీఆర్పీ ఎస్ఐ మధు తెలిపారు. ఈ ఘటన విజయనగరం రైల్వే స్టేషన్కు దగ్గర్లో జరిగిందన్నారు. మృతుని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. సదరు మృతి చెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఎస్సై నంబర్ 94934 74582కు సంప్రదించాలని కోరారు.
Similar News
News November 19, 2025
బాలికను రెండేళ్లుగా చీకటి గదిలో నిర్బబంధించిన తల్లి

చీకటి గదిలో రెండేళ్లుగా మగ్గుతున్న ఓ బాలికకు న్యాయాధికారి చొరవతో విముక్తి లభించింది. ఈ ఘటన ఇచ్ఛాపురంలోని చక్రపాణి వీధిలో నిన్న వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన తల్లి ఆడపిల్లను బయటకు పంపితే ఏం జరుగుతుందోని భయంతో ఇలా బంధించింది. స్థానికుల సమాచారంతో న్యాయాధికారి, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు వీరిద్దర్నీ బయటకి తీసుకొచ్చారు. పరిస్థితి బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.
News November 19, 2025
SKLM: ‘విద్యార్థులకు, రైతులకు రుణాలందించే చర్యలు చేపట్టాలి’

విద్యార్థులకు, రైతులకు రుణాలు ఇచ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా స్థాయి లీడ్ బ్యాంక్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ సంక్షేమ పథకాలు అమలులో బ్యాంకుల ప్రాముఖ్యతను వివరించారు.ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు.మత్స్యశాఖ మెరైన్ పోలీస్ తదితర శాఖలపై చర్చించారు.
News November 18, 2025
శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్లో కుప్ప కూలిన అధ్యాపకుడు

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.


