News August 28, 2024
SKLM: రైల్వే ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లించండి

శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ ప్రెస్లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. రైల్వే కేటరింగ్ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్లైన్లో రూ.263 చెల్లించారు. కాని వారు ఆహారాన్ని అందించలేదు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించగా బాధితుడికి నష్టపరిహారంగా రూ.25 వేలు, ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు.
Similar News
News November 7, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

★బాలియాత్ర ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
★జలుమూరు: జాబ్ మేళాలో 203 మంది ఎంపిక
★కాశీబుగ్గలో NCC విద్యార్థుల ర్యాలీ
★నిరుపేదలను ఆదుకోవడమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్
★పలాసలో కిడ్నాప్.. బాధితుడు ఏమన్నాడంటే ?
★ఎచ్చెర్ల: ఇష్టారీతిన మట్టి తరలింపు
★రణస్థలం: రహదారి లేక నరకం చూస్తున్నాం
★శ్రీకాకుళం: ప్రిన్సిపల్ వేధింపులతో చనిపోవాలనుకున్నా
★సోంపేట: అధ్వానంగా రోడ్లు..వాహనదారులకు తప్పని అవస్థలు
News November 7, 2025
SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.
News November 7, 2025
దర్శకుడిగా మన సిక్కోలు వాసి..!

మన శ్రీకాకుళం కుర్రాడు రాహుల్ దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం కానున్నాడు. సినిమాలపై మక్కువ, దర్శకుడు కావాలనే ఆసక్తితో చదువుతూనే మూవీ మేకింగ్ అంశాలను తెలుసుకున్నాడు. తొలుత వెబ్ సిరీస్లకు దర్శకత్వం, సహాయ దర్శకుడిగా పదేళ్లు పని చేశాడు.‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’(కామెడీ జోనర్) మూవీకి డైరెక్షన్ వహించగా, ఆ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్లలో విడుదలవుతోంది.


