News February 6, 2025
SKLM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్సై సందీప్ వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన తరుణ్ (19), పాజిల్ బేగ్ పేటకు చెందిన కార్తీక్ (21) బైక్పై వస్తూ డివైడర్ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Similar News
News December 21, 2025
ఇటుకల బట్టీలు వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసిన Dy DMHO

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎంహెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.
News December 21, 2025
SKLM: ‘చిన్నారులకు పోలియో రక్షణ కవచం’

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎచ్చెర్లలోని పూడివలసలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 1,55,876 మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
News December 21, 2025
శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా రమేశ్.!

శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా మొదలవలస రమేష్ను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రమేశ్ జెండా పట్టి జిల్లా TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.


