News March 29, 2024
SKLM: వాట్సప్లో మెసేజ్ ఫార్వర్డ్.. టీచర్కు షోకాజ్ నోటీస్
సారవకోటలో పెద్దలంబ పంచాయతీ మూగుపురంలో టీచర్గా పనిచేస్తున్న చౌదరి లక్ష్మీనారాయణ ఎన్నికలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు ఎంఈఓ మడ్డు వెంకటరమణ తెలిపారు. లక్ష్మీనారాయణ ఉపాధ్యాయ పనిచేస్తూ పాతపట్నం నియోజకవర్గం ఆదివాసి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయమని తన వాట్సాప్లో ప్రచారం చేసినట్లు కొంతమంది నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీస్ ఇచ్చామన్నారు.
Similar News
News January 18, 2025
శ్రీకాకుళం: జనసేన నాయకురాలు కాంతిశ్రీ మృతి
ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతి శ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో గొలివి ఆసుపత్రిలో చేరిన ఆమె నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా ఈమె ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్థిక సహాయాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్థివదేహాన్ని సందర్శనార్థం 9 తర్వాత స్వగృహానికి తెస్తారని తెలిపారు.
News January 18, 2025
చంద్రబాబు మీటింగ్కి పలువురు మంత్రులు గైర్హాజరు
CM చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలో పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, MP గంటి హరీశ్, అంబికా లక్ష్మీ నారాయణలు గైర్హాజరయ్యారు. కమిటీ మీటింగులు, ఇతర పనులు పార్టీ మీటింగ్ కంటే ఎక్కువా? అని CM సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.
News January 17, 2025
సంతబొమ్మాళి: మనస్తాపంతో సూసైడ్: ఎస్సై
పురుగు మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతబొమ్మాళిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం గొల్లపేట గ్రామానికి చెందిన పాలిన వీరస్వామి బుధవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని ఎస్సై సింహాచలం తెలిపారు.