News July 13, 2024
SKLM: వేంకన్న అవతారంలో జగన్నాథుడి దర్శనం

శ్రీకాకుళం నగరం మొండేటివీధిలో శ్రీఃలలిత సహిత శివకామేశ్వర ఆలయం వద్ద రథయాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జగన్నాథ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలకు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేంకన్న అవతారంలో స్వామివారిని అలకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News November 25, 2025
SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 25, 2025
Way2News వార్తకు రెస్పాన్స్: యూనివర్సిటీలో భవనం ప్రారంభం

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో నిరుపయోగంగా భవనం దర్శనమిస్తోంది. దీనిపై అక్టోబర్ 24న ‘ఈ భవనాన్ని వినియోగంలోకి <<18091663>>తేవాలి<<>>’ అనే శీర్షికతో Way2Newsలో వార్త ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు. భవంతిని వాడుకలో తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు ప్రారంభానికి పలువురి ప్రజాప్రతినిధులకు ఆహ్వానమిచ్చారు. రూ.34 కోట్లతో నిర్మితమైన భవనాన్ని క్లాస్ రూంలు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగించనున్నారు.
News November 25, 2025
ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.


