News February 2, 2025
SKLM: సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభం
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ, సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. 12 రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో చేయించారు. సూర్య నమస్కారం రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత వస్తుందన్నారు.
Similar News
News February 2, 2025
శ్రీకాకుళం: మార్చి 3తేదీ వరకు గ్రీవెన్స్ రద్దు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మార్చి 3 తేదీ వరకు గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక – గ్రీవెన్స్) వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం తెలిపారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ నిర్వహణ తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని మండలాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించారు.
News February 2, 2025
పాలకొండ: ఇంటర్ విద్యార్థి మృతి
హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 2, 2025
సంతబొమ్మాళి: ఈ మర్రి వృక్షానికి వందల ఏళ్లు..!
సంతబొమ్మాళి మండలం గోవింధాపురం పంచాయితిలో ఉన్న కోటబొమ్మాళి రైల్వే స్టేషన్(గ్రామంలో )వద్ద ఉన్న ఈ మర్రి చెట్టుకు ఎన్ని ఏళ్లో తెలియదు. రెండు వందల ఏళ్లు కిందట ఈ చెట్టు ఉన్నట్లు మా ముందు తరం వారు చెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఈ వృక్షం పైకొమ్మలు నుంచి ఊడలు (వేర్లు) భూమిలోకి పాతుకుపోయాయి. చెట్టు చుట్టూ వరండా కట్టారు. వేశవి కాలంలో సేద తీర్చుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందనీ స్థానికులు అంటున్నారు.