News April 13, 2025
SKLM: ఆదిత్యుని నేటి ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.2,67,800/- లు,పూజలు, విరాళాల రూపంలో రూ.78,417/-లు, ప్రసాదాల రూపంలో రూ.1,76,405లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.
Similar News
News April 15, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలోని 2015, 2016, 2017,2018, 2019 ఎడ్మిట్ డిగ్రీ విద్యార్థులకు 2,4,6 సెమిస్టర్ పరీక్షలకు స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ను నేడు యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి జరుగుతాయని, పరీక్ష ఫీజు మే 17వ తేదీ లోపు చెల్లించవచ్చని తెలిపారు.
News April 14, 2025
శ్రీకాకుళంలో సైనిక్ భవన్ శంకుస్థాపన

శ్రీకాకుళం కేంద్రంలో రాగోలులో సైనిక్ భవన్ నిర్మాణం సోమవారం జరిగింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భూమి పూజలకు హాజరై శంకుస్థాపన చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ సైనకులు పాల్గొన్నారు.
News April 14, 2025
శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థిని

శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం-4 లో చదువుతున్న విద్యార్థిని చెన్నంశెట్టి జ్యోతికి ఇంటర్మీడియట్ MLTలో 984 మార్కులు సాధించినట్లు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, శ్రీకాకుళం డివిజన్ అధికారి జి.చంద్రమౌళి సోమవారం తెలిపారు. హాస్టల్ నుంచి ఇంటర్ సెకండియర్లో 13మందికి 900 కు పైగా, ఫస్ట్ ఇయర్లో 11 మంది విద్యార్థులకు 450కి పైగా మార్కులు వచ్చాయన్నారు.