News November 22, 2025
SKLM: ఆర్టీసీ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీసులు బేష్

శ్రీకాకుళం జిల్లా RTC సంస్థ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీస్ సేవలు భేష్ అని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ పేర్కొన్నారు. సేవలందించిన రెండు ఏజెన్సీలు నిర్వాహకులను శనివారం స్థానిక కాంప్లెక్స్లో ఆయన అభినందించారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలకు సంబంధించిన వివిధ రకాల పార్సిల్లను ఎంత దూరమైన అందించే సేవలో ఆర్టీసీ పనిచేస్తుందన్నారు. DMలు నరసింహుడు, శర్మ, ఎంపీరావు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
బెల్జియం అమ్మాయి.. సిక్కోలు అబ్బాయి.. కట్ చేస్తే!

బెల్జియం దేశానికి చెందిన యువతి శ్రీకాకుళానికి చెందిన యువకునికి ఘనంగా వివాహం జరిగింది. శ్రీకాకుళం హయాతి నగర్కు చెందిన యువకుడు శ్రీ రంగనాథ సాహిత్ బెల్జియంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న కెమిలీ మస్కర్తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో శ్రీకాకుళంలో శనివారం రాత్రి జరిగిన వివాహంతో వారిద్దరు ఒకటయ్యారు.
News November 23, 2025
శ్రీకాకుళం: దైవ దర్శనాలకు వెళ్తూ మృత్యుఒడిలోకి..!

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యాన్లో దైవ దర్శనాలకు వెళ్తూ <<18364371>>మృత్యుఒడిలోకి<<>> చేరుకున్నారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయోధ్య, కాశీ, పూరీ వంటి క్షేత్రాలు దర్శించుకున్న అనంతరం శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
News November 23, 2025
శ్రీకాకుళం: ఘోర ప్రమాదం..నలుగురు మృతి

కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద హైవేపై ఆదివారం వేకువజామున ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62), డెడ్ బాడీలు కోటబొమ్మాళి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.కోటబొమ్మాళి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు.


