News November 11, 2024

SKLM: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35 వేల మందికిపైగా చదువుతున్నారు. అక్టోబర్ 21 నుంచి చెల్లింపు మొదలవ్వగా వీరంతా ఈ నెల 11వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Similar News

News March 1, 2026

SKLM: ‘పటిష్ఠమైన భద్రత ఉన్న భవనంలో మాదకద్రవ్యాల నిల్వ ఉంచాలి’

image

పటిష్ఠమైన భద్రత ఉన్న భవనంలో పట్టుబడిన మాదకద్రవ్యాలు నిల్వ ఉంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం పాత వంశధార క్వార్టర్స్‌లోని భవనాలను కలెక్టర్‌తో పాటు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏ‌ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. భవనం చుట్టూ ఫ్లడ్ లైట్లు, నిరంతర నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

News March 1, 2026

SKLM: ‘పటిష్ఠమైన భద్రత ఉన్న భవనంలో మాదకద్రవ్యాల నిల్వ ఉంచాలి’

image

పటిష్ఠమైన భద్రత ఉన్న భవనంలో పట్టుబడిన మాదకద్రవ్యాలు నిల్వ ఉంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం పాత వంశధార క్వార్టర్స్‌లోని భవనాలను కలెక్టర్‌తో పాటు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏ‌ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. భవనం చుట్టూ ఫ్లడ్ లైట్లు, నిరంతర నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

News February 28, 2026

SKLM: తగ్గుముఖం పట్టినంతవరకు వైద్య బృందం అప్రమత్తం

image

శ్రీకాకుళంలో డయేరియా పూర్తిగా తగ్గుముఖం పట్టినంత వరకు వైద్యాధికారుల బృందం అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి అన్నారు. శనివారం దమ్మలవీధి, కాకివీధి, బోడెమ్మకోవెల, తదితర అతిసార ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. అతిసారం తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఆరుబయట ఆహార పదార్థాలు తినరాదని, కాచి చల్లార్చిన నీరు తాగాలన్నారు.