News December 13, 2024

SKLM: ఈ నెల 16న ఎస్సీ ఉప వర్గీకరణ కమిషన్ పర్యటన

image

ఏపీ ప్రభుత్వం నియమించిన షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా (రిటైర్డ్) ఈనెల 16న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ ఛైర్మన్ 16న ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని, 11 గంటల నుంచి 2 గంటల వరకు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమవుతారు.  

Similar News

News April 25, 2025

శ్రీకాకుళం: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త శశిభూషణ్ గురువారం తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల విద్యార్థుల సమీప స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9703585990 నంబరుని సంప్రదించాలని పేర్కొన్నారు.

News April 25, 2025

బుడగట్లపాలెం : సీఎం చేతుల మీదుగా రూ. 250 కోట్ల పంపిణీ 

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మత్స్యకార భరోసా పథకం కింద 250 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుడగట్లపాలెంలో గురువారం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 26న నిధులు పంపిణీకి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.

News April 25, 2025

సీఎం చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్

image

రేపు (శనివారం) CM చంద్రబాబు ఎచ్చెర్లకు రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది.☛ 10:00AM విజయవాడ ఏయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో రాక☛11:55AM బుడగట్లపాలెం హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ ☛12:10 PM బుడగట్లపాలెంలో అమ్మవారిని దర్శించుకుంటారు.☛ 1:20 నుంచి బుడగట్లపాలెం ప్రజలతో సమావేశం.☛ 3:25PM – 4:55PM పథకం ప్రారంభ కార్యక్రమం.☛5:00PM తిరిగి బుడగట్లపాలెం హెలిప్యాడ్ నుంచి విశాఖ ప్రయాణం.

error: Content is protected !!