News January 11, 2025

SKLM: ఈ నెల13న మీకోసం ఫిర్యాదుల స్వీకరణ రద్దు

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 13న సోమవారం జరుగు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలు వృథా చేసుకొని పోలీసు కార్యాలయానికి రావద్దని ఎస్పీ సూచించారు.

Similar News

News December 24, 2025

శ్రీకాకుళంలో చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి సూసైడ్

image

శ్రీకాకుళం పట్టణంలోని మండల వీధికి చెందిన జాడే కృష్ణ (39) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు బుధవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. గత మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 1వ పట్టణ ఎస్ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News December 24, 2025

ఆమదాలవలస : క్రిస్మస్ సోదరులకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

image

క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా సైకత శిల్పి గేదెల హరికృష్ణ బుధవారం చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. ఆమదాలవలస మండలం సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇసుకతో జీసస్ ప్రతిరూపాన్ని తయారుచేసి క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలియజేశారు. ఈ శిల్పాన్ని పలువురు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News December 24, 2025

శ్రీకాకుళం: రైల్వే ట్రాక్ దాటుతుండగా వ్యక్తి దుర్మరణం

image

శ్రీకాకుళం GRP పరిధి నెల్లిమర్ల- విజయనగరం మధ్యలో రైల్వే ట్రాక్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. తిరుచునాపల్లి నుంచి హౌరా వెళ్లే రైలు వస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌ను దాటుతుండడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతదేహాన్ని విజయనగరం మహారాజా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు.