News March 18, 2025
SKLM: ఓటర్లు జాబితా తయారీకి చర్యలు తీసుకోవాలి

2కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ఓటర్లకు దగ్గరిలో ఉన్న పోలింగ్ కేంద్రానికి షిఫ్టింగ్ / మెర్జ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారిణి సాయి ప్రత్యూష స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం తహశీల్దారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఓటర్లు జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీల నుంచి సూచనలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 21, 2025
నందిగాం: జీడి చెట్టుకి ఉరేసుకుని వ్యక్తి మృతి

నందిగామ మండలం హరిదాసు పురం గ్రామానికి చెందిన అక్కురాడ డిల్లేశ్వరరావు శుక్రవారం జీడి తోటలో ఉరేసుకుని చనిపోయాడు . జీడి పిక్కలు కోయడానికి వెళ్లిన తన తమ్ముడు చూసి, పోలీసులకు సమాచారం తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు . దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 21, 2025
గార: నదిలో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృత దేహం

గార మండలం కళింగపట్నం సమీపంలో వంశధార నదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 21, 2025
ఇచ్ఛాపురంలో లారీ దొంగతనం

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం రోజున రాత్రి ఇచ్ఛాపురం మండల కేంద్రంలో నిలిపి ఉన్న లారీని ఎవరో దొంగలించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు.