News February 1, 2025
SKLM: ఓర్పు, సహనంతోనే లక్ష్యం సాధించగలం: ఎస్పీ

ఓర్పు, సహనంతోనే లక్ష్యం సాధించగలమని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం పట్టణంలో స్థానిక ఉమెన్స్ కాలేజీలో ముఖా ముఖీ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, సెల్ ఫోన్లు ద్వారా విజ్ఞానాన్ని పెంపుదించుకోవాలన్నారు. డీఎస్పీ సి.హెచ్ వివేకానంద ఉన్నారు.
Similar News
News October 30, 2025
SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.
News October 30, 2025
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

కొత్తూరు మండలం కడుమ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం మాలతీబాయి (48) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రం కాశీనగరంలో నివాసం ఉంటూ ప్రతిరోజూ విధులకు కడుమ సచివాలయానికి ద్విచక్ర వాహనంపై వస్తుంటారు. ఇవాళ విధులకు వస్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మాలతీ బాయి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 30, 2025
శ్రీకాకుళం: 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం

తుఫాన్ వర్షాలు కారణంగా జిల్లాలో 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా చేతికి అంది వచ్చిన పంట నేలవాలిందని, కొన్నిచోట్ల నీట మునిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట పొలాలను పరిశీలించి తుది అంచనా సిద్ధం చేస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫారుక్ అహ్మద్ ఖాన్ తెలిపారు.


