News April 13, 2025

SKLM: ‘కోర్టు విధుల్లో సిబ్బంది ప్రతిభ చూపాలి’

image

కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు విధుల్లో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ప్రతిభ కనబర్చాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి కోర్టు లైజనింగ్ అధికారులకు సూచించారు. శనివారం కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమని ఎస్పీ అన్నారు. వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలను ఎస్పీకి సిబ్బంది వివరించారు.

Similar News

News April 13, 2025

SKLM: ఆదిత్యుని నేటి ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.2,67,800/- లు,పూజలు, విరాళాల రూపంలో రూ.78,417/-లు, ప్రసాదాల రూపంలో రూ.1,76,405లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.

News April 13, 2025

మందస : పరీక్ష రోజు తండ్రి మృతి.. 483 మార్కులతో సత్తా 

image

తన తండ్రి మరణాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ సీఈసీలో 483/500 మార్కులు సాధించింది. మందస గ్రామానికి చెందిన శివాని తండ్రి పండా పరీక్ష రోజు గుండెపోటుతో మరణించారు. పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షలు రాసింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకబడకుండా పరీక్షలలో సత్తా చాటడంతో అధ్యాపకులు,కుటుంబీకులు అభినందనలు తెలిపారు.

News April 13, 2025

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధరలు ఎంతంటే

image

శ్రీకాకుళంలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం బాయిలర్ లైవ్ రూ.150, డ్రెస్డ్ రూ. 255, స్కిన్ లెస్ రూ. 275 ధరలు ( కేజీల్లో) ఉన్నాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా విపరీతంగా తగ్గిన ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇప్పటికే చికెన్ ప్రియులు షాపుల వద్ద బారులు తీరారు. ఆదివారం కావడంతో జిల్లాలో ముమ్మరంగా చికెన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా స్వస్ప వ్యత్యాసంతో ఇదే ధరలు ఉన్నాయి.

error: Content is protected !!