News December 9, 2025
SKLM: జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోండి

శ్రీకాకుళం జిల్లాలోని ఈనెల 13న అన్ని కోర్టుల్లో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, భూతగాదాలు రోడ్డు ప్రమాదాలు బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు విషయంలో వీలైనంతవరకు ఎక్కువమంది రాజీ పడే విధంగా సంబంధిత అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.
Similar News
News February 1, 2026
సీసీ కెమెరాలు నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్: ఆర్ఐవో

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైనట్లు ఆర్ఐఓ సురేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 119 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 10 వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని, ప్రత్యేక కమిటీల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పారదర్శకంగా పరీక్షలు పూర్తి చేస్తామన్నారు.
News February 1, 2026
కేంద్ర బడ్జెట్పై కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పందన

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయ అధికారులు వివరాలు వెల్లడించారు. 2026-27 కేంద్ర బడ్జెట్ స్థిరమైన ఆర్ధిక విధానంతో పాటు పెట్టుబడులు, సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టడం హర్షణీయం అన్నారు. నూతన ఆదాయపు పన్ను చట్టం, టూరిజం, డేటా సెంటర్లు ఏర్పాటు నిర్ణయాలు బాగున్నాయన్నారు.
News February 1, 2026
రణస్థలం: ‘లేబర్ కోడ్లను రద్దు చేయాలి’

లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. రణస్థలంలో ఆదివారం ఫిబ్రవరి 12 సమ్మె కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసేందుకు లేబర్ కోడ్లను తెచ్చారని అన్నారు.


