News October 13, 2025
SKLM: ‘ధాన్యం రవాణా వాహనాలకు GPS తప్పనిసరి’

రైతులు వద్ద ధాన్యం కొన్న తరువాత రవాణా చేసే ప్రతి వాహనానికి కచ్చితంగా జీపీఎస్ GPS పరికరం అమర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా రూ.3068 చెల్లించి GPS యంత్రాన్ని అమర్చుకోవాలని సూచించారు. రైతుసేవా కేంద్రాల వద్ద వాటి వివరాలు నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News October 13, 2025
ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 13, 2025
నేడు విధుల్లో చేరనున్న నూతన ఉపాధ్యాయులు

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 528 మంది నూతన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారని DEO రవిబాబు తెలిపారు. వీరికి ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించి, పోస్టింగ్ ఆర్డర్స్ జారీచేశామని వెల్లడించారు. వీరంతా సోమవారం విధుల్లో చేయనుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నామని DEO పేర్కొన్నారు.
News October 13, 2025
శ్రీకాకుళం: నేటి నుంచే ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో రవిబాబు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నపత్రాల పంపిణీ కార్యక్రమం పూర్తయిందన్నారు. 1 తరగతి నుంచి 5వ తరగతులకు 13 నుంచి 15వ తేదీ వరకు, 6వ తరగతి నుంచి 10 వరకు 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పకడ్బందీగా చేపడుతున్నామన్నారు.