News April 15, 2024

SKLM: ‘ముద్దాయిల కేసుల్లో చార్జిషీట్లు త్వరితగతను ఫైల్ చేయాలి’

image

జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో చార్జిషీట్లు త్వరితగతను ఫైల్ చేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. సోమవారం శ్రీకాకుళం పట్టణంలో జిల్లా కోర్టులో వీడియో కాన్ఫరెన్ష్ హాల్లో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో పోలీసులు త్వరతగితిన ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి, కోర్టు వారికి పోలీసు వారు సహకరించాలని కోరారు.

Similar News

News July 24, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 26న జాబ్ మేళా

image

జిల్లాలో బలగ జంక్షన్‌లోని ప్రభుత్వ DLTC ఐటీఐ కళాశాలలో ఈ నెల 26వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ pvt ltd, 2050 హెల్త్ కేర్ కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ (డీజిల్, మోటర్ మెకానిక్), జిడిఏ, MPHW, ANM & GNM గల 18 నుంచి 40 సంవత్సరాల వారు అర్హులన్నారు.

News July 24, 2024

MLAకు అయ్యన్న సూచన.. నవ్విన పవన్ కళ్యాణ్

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్న నవ్వులు పూయించారు. రోడ్ల గురించి ప్రశ్నించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు స్పీకర్ అయ్యన్న అవకాశం ఇచ్చారు. ఆయన పార్టీ పెద్దలకు, మంత్రులకు, నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెబుతుండగా.. స్పీకర్ అయ్యన్న కలగజేసుకొని రోడ్ల గురించి మాట్లాడాలని సూచించారు. దీంతో ముందు వరుసులో కూర్చున్న పవన్ కళ్యాణ్‌తోపాటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.

News July 24, 2024

‘శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న పాముకాట్లు’

image

శ్రీకాకుళం జిల్లాలో పాము కాటు కేసులు రోజురోజుకీ అధికం అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు పరిశీలిస్తే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,023 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో గత మూడు నెలల్లో 100 పైగా పాముకాటు కేసులు నమోదు కాగా శరీరంపై ఉన్న కాట్లను బట్టి పాము కరిచినట్లు నిర్దారించిన కేసులు 62 నమోదు అయినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.