News January 30, 2025
SKLM: రథసప్తమి పండగ .. టూరిజం బస్సు ఏర్పాటు

శ్రీ సూర్యనారాయణ స్వామి రాష్ట్ర పండగ రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో టూరిజం ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. టూరిజం సంస్థ నేతృత్వంలో మినీబస్సు ఏర్పాటు చేశారన్నారు. శ్రీకూర్మం, మొగదలపాడు, సాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస సర్క్యూట్ తిప్పిచూపిస్తారు. సన్రైజ్ హోటల్ రిసెప్షన్ వద్ద ఏపీ టూరిజం కౌంటర్ ఉందన్నారు. వ్యక్తికి రూ.750 ఉంటుందన్నారు.
Similar News
News September 14, 2025
శ్రీకాకుళం: పండగల వేళ స్పెషల్ ట్రైన్స్

దసరా, దీపావళి సందర్భంగా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06039 MAS- BJU ట్రైన్ను నేటి నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం, నం.06040 BJU- MAS ట్రైన్ను SEPT 17 నుంచి DEC 3 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో రాజమండ్రి, ఏలూరు, విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News September 14, 2025
శ్రీకాకుళం డీఈఓగా రవిబాబు

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. DEO కార్యాలయంలో ADగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్ఛార్జి DEOగా కొనసాగారు. జిల్లాలో విద్యా శాఖ అభివృద్ధికి అధికారుల సహాయంతో ముందడుగు వేస్తానని ఆయన అన్నారు.
News September 14, 2025
శ్రీకాకుళం: ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.